లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలి..కలెక్టర్
Ens Balu
4
Visakhapatnam
2020-08-15 21:11:24
విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ హెచ్చరించారు. ఈ సందర్భంగా డివిజన్, మండల స్థాయి రెవెన్యూ అధికారులు,సిబ్బంది స్థానికంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని, తగు ముందుస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు గాను జిల్లా కలెక్టరేట్ నందు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలలో, తహసిల్దార్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేశారు. విశాఖపట్నం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 08912590102 ఆర్టీవో విశాఖపట్నం 8790310433 ; ఆర్డిఓ అనకాపల్లి: 8143631525; 8790879433;. సబ్ కలెక్టర్ నర్సీపట్నం : 8247899530; 7675977897; ఆర్ డి ఓ పాడేరు : 08935-250228; 8333817955; 9494670039; 8331821499.ఇదే విధంగా ప్రతి తహసిల్దారు కార్యాలయాలలోకూడా కంట్రోల్ రూం లు ఏర్పాటు చేయ బడతాయని తెలిపారు.