మత్తుమందులకు ప్రతీ ఒక్కరూ దూరంగా ఉండాలి..మంత్రి
Ens Balu
3
Visakhapatnam
2020-08-15 21:19:41
మత్తు పదార్ధాలకు ప్రతీ ఒక్కరూ దూరంగా ఉండాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయన జిల్లా కలెక్టర్ , సిపిలతో కలిసి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో పతాక ఆవిష్కరణ అనంతరం మాదక ద్రవ్యాల నిషేధం, మత్తుపదార్థాల బానిసలైన వారికి విముక్తి కలిగించడం పై పోస్టర్లను విడుదల చేశారు. వ్యసన విముక్త భారత్ ప్రచార కమిటీ (నాష్ ముక్త్ భారత్) రూపొందించిన పోస్టర్లను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ పరంగా మత్తునుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న కేంద్రాలను పూర్తిస్థాయిలో సద్వినాయోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ పోలీస్ కమిషనర్ ఆర్.కె. మీనా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ సీతామహాలక్ష్మి, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.