ఏఎంజీ రథ్ డెచిమన్ సేవలు హర్షనీయం..


Ens Balu
2
Visakhapatnam
2021-01-30 21:21:08

వైద్యులు దేవుడితో సమానమని విశాఖ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు వంశీ క్రిష్ణ శ్రీనివాస్ అన్నారు. ఏఎంజీ రథ్ డెచిమన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో 21వ వార్డు రెల్లివీధిలో శనివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, ప్రస్తుత తరుణంలో ప్రజలకు వైద్యసేవలు చాలా అవసరమన్నారు. అలాంటి వైద్యసేవలు ఉచితంగా నిర్వహించడానికి ఏఎంజీ రథ్ డెచిమన్ ఆసుపత్రి ముందుకి రావడం అభినందనీయమన్నారు.  కరోనా సమయంలో చాలా మందికి వైద్యసేవలు పొండం కూడా కష్టమవుతున్న తరుణంలో ఉచిత మెడికల్ క్యాంపు ద్వారా పరీక్షలు చేయడం తో ఉచితంగా మందులు సరఫరా చేయడం చెప్పుకోదగ్గ అంశమని కొనియాడారు.  ఈ మెగా క్యాంపు లో వైద్య నిపుణులు  జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, గైనికాలజీ, పెడియాట్రిక్స్, సర్జికల్ ఆన్కలజి, ఫిజియోథెరఫీ, అన్ని డిపార్ట్మెంట్ ల స్పెషలిస్ట్ డాక్టర్లు కాంప్ లో పాల్గొని ఉచిత మందులు అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి మొల్లి అప్పారావు, 3టౌన్ సిఐ ఈశ్వర రావు , వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.