త్యాగధనులను సేవలు మరువరానివి
Ens Balu
2
Visakhapatnam
2020-08-15 21:17:33
74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఉప సంచాలకులు వి. మణిరామ్ జెండా ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కొరకు ఎoతో మంది నాయకులు, ప్రజలు తమ జీవితాలను త్యాగం చేశారన్నారు. వారి త్యాగాలను ఎల్లప్పుడు గుర్తుంచుకోవాలని, వారిని స్ఫూర్తి గా తీసుకోని దేశ అబివృద్ధి కి కష్టపడి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పి. ఆర్. ఒ. వెంకటరాజ్ గౌడ్, అదనపు పి. ఆర్. ఒ. సాయి బాబా ఇతర సిబ్బంది పాల్గొన్నారు.