బొలిశెట్టి గోవిందరావు అక్రమ ఆస్తులపై విచారణ చేయాలి..సోమిరెడ్డి రాజు


Ens Balu
2
Yalamanchili
2020-08-15 21:29:03

స్వాతంత్య్రం సాధించుకోవడం కోసం నాటి మహనీయులు ఆస్తులు దేశం కోసం వదులుకుంటే.. నేటి మన నాయకులు తాను తన బంధువుల పేరున బినామీగా వందల ఎకరాలు భూములు, కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టుకోవడం మన దుర దుష్టకరమని సమాచార హక్కుచట్టం కార్యకర్త సోమిరెడ్డి రోజు ఆవేన వ్యక్తం చేశారు. ఎస్.రాయవరంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, మాజీ ఎంపిటిసి మాత్రమే అయిన బొలిశెట్టి గోవిందరావు, తన అత్త, మామ ఇద్దరు బావమరుదులు పేరున భూములు బినామీగా కొని విజయనగరముకు చెందిన భార్య కుటుంబసభ్యుల చేతిలో బందీ అయ్యాడన్నారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు తమవద్ద ఉన్నాయన్నారు. అంతేకాకుండా కాకినాడలో తన అక్క పేరున, తన స్నేహితుడు దాసరి దొంగబాబు, లాక్కోజు ఆదిమూర్తి, మరి కొందరి పేరున బినామీగా అక్రమ సంపాదనతో ఆస్తులు కొన్నాడని ఆరోపించారు. విచిత్రంగా ఎస్.రాయవరం గ్రామంలో సెంటు భూమి, ఇళ్ళుకాని లేవు. ఇక్కడ రాజకీయనాయకుని ముసుగులో అక్రమంగా సంపాదించి ఇతర ప్రాంతాలలో కొంటున్నాడని చెప్పారు. ఇవి కాక ఇంకా ఉన్న ఇతర ఆస్తులను ఎవరికైనా తెలిసి ఉంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తమకు తెలియజేయాలన్నారు. వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని కూడా రాజు వివరించారు.
సిఫార్సు