సమాజ ప్రగతిలో జర్నలిస్టులు చాలా కీలకం..
Ens Balu
5
Visakhapatnam
2021-02-01 20:22:43
సమాజ ప్రగతిలో జర్నలిస్టుల పాత్ర అత్యంత ప్రసంశనీయమని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఎ.పి. బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విశాఖలోని వైశాఖి జలఉద్యాన వనంలో విశాఖ జిల్లా జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వాసుపల్లి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విశాఖ జిల్లా జర్నలిస్టులు ప్రగతి సాదకులు అని కొనియాడారు. తాను ఈ స్థాయికి ఎదిగానంటే అందులో జర్నలిస్టుల పాత్ర కూడా ఉందన్నారు. వారి సంక్షేమానికి ప్రభుత్వపరంగా, తాను వ్యక్తిగతంగా కూడా కృషిచేస్తానన్నారు. కార్యక్రమానికి గౌరవ అతిధిగా హాజరైన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఎ.పి. వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాలలో అత్యంత బలమైన యూనియన్ గా నిలిచామన్నారు. కేవలం తాము చేపట్టి కార్యక్రమాలను మాత్రమే కొనిసాగిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. జర్నలిస్టులను కోవిడ్ వారియర్స్ గా గుర్తించాలని ప్రధానమంత్రి మోడి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలికి వినతిపత్రాలు నివేదించామన్నారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్లు పూర్తి స్థాయిలో మంజూరు చేయాలని, ఇండ్ల స్థలాలు తక్షణమే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. 2021లో విశాఖ జిల్లాకు సంబంధించి 800 మంది జర్నలిస్టులకు సభ్యుత్వం జారి చేయడం జరుగుతుందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఫెడరేషన్ అర్బన్ అధ్యక్షులు పి. నారాయణ మాట్లాడుతూ అందరి సహాకారంతో ఫెడరేషన్ను పూర్తి స్థాయిలో బలో పేతం చేస్తున్నామన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. వారం రోజులు పాటు అర్బన్, రూరల్ లో సభుత్వ నమోదు కార్యక్రమం చురుకుగా సాగుతుందన్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి, శ్రీనుబాబు చేతులు మీదగా పలువురు జర్నలిస్టులకు సభుత్వం నమోదు కార్డులు అందజేసారు. అనంతరం జర్నలిస్టులు వాసుపల్లికి ముందస్తుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సాత్కారించారు.
కార్యక్రమంలో ఫెడరేషన్ అర్భన్ కార్యదర్శి ఎస్. అనురాధ, ఆర్గనైజింగ్ సెక్రటరీ డి. రవికుమార్, బ్రాడ్ కాస్ట్ విశాఖ జిల్లా అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, ఉపాధ్యక్షలు బి. శివప్రసాద్, ఎ.సాంబశివరావు, కె. మురళీకృష్ణ, రాష్ట్ర సభ్యులు జి. శ్రీనివాసరావు, సినియర్ నాయకులు పి.ఎ.ఎన్. పాత్రుడు, చింత ప్రభాకారరావు, జి. రాంబాబు, వై.రామకృష్ణ, ఎన్.రామకృష్ణ, ఇజ్రాయల్, బొప్పన రమేష్, అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.