వంశీ క్రిష్ణశ్రీనివాస్ కి SCRWA శుభాకాంక్షలు..
Ens Balu
3
Visakhapatnam
2021-02-05 14:17:29
వైఎస్సార్సీపీ విశాఖ నగర అధ్యక్షులు, మంచి మనిషి, సేవాతత్పరుడు, నా అనుకునే వారికి అండగా నిలిచే మ్రుదు స్వభావి వంశీక్రిష్ణ శ్రీనివాస్ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ ఆకాంక్షించారు. శుక్రవారం వంశీక్రిష్ణశ్రీనివాస్ జన్మదినోత్సవం సందర్భంగా విశాఖలోని ఆయన ఇంటి దగ్గర అసోసియేషన్ ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గజమాలతో ఘనంగా సత్కరించారు. అంతకు ముందుగా కాంగోతో ఊరేగింపుగా వంశీ నివాసానికి చేరుకొని వంశీతో కేక్ కట్ చేయించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం అశోక్ కుమార్ మాట్లాడుతూ, విశాఖనగరంలో వైఎస్సార్సీపీకి తిరుగులేని నేత వంశీ మాత్రమే అన్నారు. పార్టీ అభివ్రుద్ధికిగానీ, ప్రజాసేవకు గానీ ఈయనకు మించిన వ్యక్తి లేరని కొనియాడారు. ఎందరికో తన పరిధికి మంచి సేవలు చేసే మంచి వ్యక్తి వంశీక్రిష్ణశ్రీనివాస్ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి నక్కాన అజయ్ కుమార్, కార్యవర్గ సభ్యులు జీ.వి.సాగర్,దివాకర్ తదితరులు పాల్గొన్నారు.