పోసమ్మ మెడను తాకిన గోదారి వరదనీరు..


Ens Balu
2
devipatnam
2020-08-16 13:15:56

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పొసమ్మగండి వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి నీరు అమ్మవారి మెడను తాకింది. మూడు గంటల పాటు వరదనీరు అమ్మవారివిగ్రహం పీక వరకూ చేరుతూనే ప్రవహించింది. అంతేకాకుండా దేవిపట్నం, పూడిపల్లి గ్రామాల్లోకి కూడా నీరు ప్రవేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు గ్రామంలో వరదనీటిలో చిక్కుకున్నవారిని పడవల సహాయంలో బయటకు తీసుకు వస్తున్నారు. గోదావరి ఉద్రుతి వరనీరు గ్రామాల్లోకి రావడంతో లోతట్టు ప్రాంతాల వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు దేవీపట్నం మండలం తొయ్యూరు వద్ద జూనియర్ కళాశాలలో కూడా వరదనీరు చేరింది. గ్రామంలోని చేరిన నీరు మోకాలు పై వరకూ రావడం విశేషం.