500 మంది పీఓలకు నోటీసులు..


Ens Balu
3
కదిరి
2021-02-07 18:05:13

అనంతపురం జిల్లాలోని కదిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో నిర్వహించే తొలి దశ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన శిక్షణా తరగతులకు హాజరుకాని 500 మందికి పైగా పిఓలకు కదిరి ఆర్డీవో మరియు డిప్యూటీ ఎలక్షన్ అథారిటీ వెంకటరెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శిక్షణ తరగతులకు హాజరు కాని పీఓలు ఎన్నికల విధులకు తప్పనిసరిగా హాజరుకావాలని, ఎన్నికల విధులకు హాజరు కాకపోతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని కదిరి ఆర్డీవో మరియు డిప్యూటీ ఎలక్షన్ అథారిటీ హెచ్చరించారు. ఎన్నికల విధులకు కేటాయించిన పీఓలు, ఇతర సిబ్బంది ఖచ్చితంగా వారికి కేటాయించిన విధులను నిర్వర్తించాలని సూచించారు.