ఎమ్మెల్సీ బరిలోకి టి.శ్రీనివాస్ విశ్వనాథ్..
Ens Balu
1
Kakinada
2021-02-10 13:53:33
ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ బరిలో మాజీ సైనికుడు, ప్రభుత్వ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ పేరు ఉపాధ్యాయ వర్గాలలో బలంగా వినిపిస్తుంది. ఉభయగోదావరి జిల్లాలలో ఉపాధ్యాయ సంఘాలలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఒక సంఘం విశ్వనాథ్ పేరును ఖరారు చేసినట్టుగా విశ్వసనీయ సమాచారం. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో అత్యంత సాన్నిహిత్యం ఉన్న విశ్వనాథ్ ఎన్నికల బరిలో ఉంటే గెలుపు ఖాయమని ఇప్పటికే పలువురు ఉపాధ్యాయులు విశ్వనాథ్ ను కలిసి తమ మద్దతు కూడా ప్రకటిస్తున్నారు. వివరాలు తెలుసుకుంటే తూతిక శ్రీనివాస విశ్వనాథ్ 15 సంవత్సరాలు ఇండియన్ నేవీ మిలటరీలో దేశానికి సేవలందించారు. మాజీ సైనికుడైన విశ్వనాథ్ 2007 సంవత్సరం గ్రూప్ 1 అదికారిగా ఎంపికై మండల పరిషత్ అభివృద్ధి అదికారిగా ఉభయగోదావరి జిల్లాలలో అనేక మండలాలలో సేవలందించి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఉద్యోగభందుగా పేరున్న విశ్వనాథ్ ప్రజా సమస్యలు, ఉద్యోగ సమస్యలపై అనేక సంధర్భాలలో ఉద్యమాలు చేసి తన ప్రత్యేకత చాటుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను విశ్వనాథ్ అనేక సంధర్భాలలో ఎండగట్టి ఉద్యోగ ఉపాద్యాయ పక్షపాతిగా నిలిచారని చెపచ్చు. ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రభుత్వ కాంట్రిబ్యూటరీ పించన్ విదానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన విశ్వనాథ్ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా తనదైన శైలిలో ఉద్యమించిన తీరు అభినందనీయమని ఉద్యోగ ఉపాధ్యాయ సమాజం ఇప్పటికి గుర్తు చేసుకుంటుంటారు. బిజినెస్ మ్యానేజ్మెంటులో, న్యాయ శాస్త్రంలో మాస్టర్ పట్టా పొందిన విశ్వనాథ్ విద్యాదికుడిగా పేరుంది. తన సేవాకాలంలో చాలా మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు అనేక విషయాలలో సహకరించడం, సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం అందరికి తెలిసిందే. సమస్య ఏదైనా ఎవరిదైనా తన సొంత పనిగా భావించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలలో అభిప్రాయము ఉంది. గత మూడు దశాబ్దాలుగా సామాజిక ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిన విశ్వనాథ్ ప్రస్తుతం అనేక సంఘాలలో యాక్టివ్ పాత్ర పోషిస్తు సంభందిత వర్గాలకు న్యాయం చేస్తున్నారు. యం.పి.డి.ఓ గ్రూప్1 అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ గా, తూర్పుగోదావరి జిల్లా బిసి ఉద్యోగుల సంఘం కార్యధర్శిగా, బిసి జనసభ రాష్ట్ర కార్యధర్శిగా, యస్సీ, యస్టీ, బీసి, మైనారిటీ ఉద్యోగ, ఉపాద్యాయ జెఏసి జిల్లా గౌరవ అద్యక్షుడిగా, మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అద్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర ప్రదాన కార్యధర్శిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ప్రైవేట్ రంగం రిజర్వేషన్ సాధన సమితి జిల్లా అద్యక్షుడిగా, ఇలా పలు ఉద్యోగ, ప్రజా సంఘాలలో సేవలందిస్తున్న విశ్వనాథ్ పేద, బడుగు బలహిన వర్గాల పక్షపాతిగా పేర్గాంచారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సహాయికుల సంక్షేమం కోసం, సాంకేత నిపుణులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల బద్రత కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వేలాది మంది ఉద్యోగులతో 'మహా నిరాహార దీక్ష' చేసి జిల్లా యంత్రాంగాన్ని, ప్రభత్వాన్ని కదిలించి ఉద్యోగాలు కోల్పోయిన 450 మందికి తిరిగి ఉద్యోగాలు ఇప్పించి ఉద్యోగుల మన్ననలు పొందారు. యస్సీ, యస్టీ వర్గాలు సామాజిక వివక్షను ఎదుర్కుంటున్నారని అంబేడ్కర్ ఆలోచన విదానం ఫౌండేషన్ తరుపున "ఉత్తరాల ఉద్యమానికి' శ్రీకారం చుట్టి రిజర్వేషన్లు అనుభవిస్తున్న యస్సీ యస్టీ యం.పిలు, యం.యల్.ఏలు పార్లమెంటులో, అసంబ్లీలో దళిత, గిరిజన సమస్యలపై తమ గళం విప్పాలని డిమాండ్ చేసారు. తూర్పుగోదావరి జిల్లాలో యస్సీ, యస్టీ ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు నాయకులు చేసిన సైకిల్ జాతకు సహకరించి ఆంధ్రప్రదేశ్ లో యస్సీ యస్టీ ఉప ప్రణాళిక చట్టం ఏర్పడడానికి విశ్వనాథ్ తనవంతు పాత్ర పోషించాడు. అగ్రవర్ణ పేదల ఉద్యోగ ఉపాది విషయాలలో ప్రభుత్వం రిజర్వేషన్లు వర్తింపు చేసి అమలు చేయాలని అలాగే ముస్లీంల సామాజిక ఆర్థిక జీవన విదానం మెరుగుపడాలంటే సచార్ కమిటీ సిఫార్స్ అమలు చేయాలని ప్రభుత్వంపై విశ్వనాథ్ తెచ్చిన ఒత్తిడి పలువురు ప్రశంసలు అందుకుంది. సామాజిక కార్యకర్తగా తనమన బేదం లేకుండా అన్ని వర్గాలకు విశ్వనాథ్ అందించిన సేవలను గుర్తించి ప్రజా సంఘాలు ప్రజాభందు పురష్కారంతో సత్కరించాయి. గత ప్రభుత్వంలో నిరుపేదలకు ఇచ్చే సామాజిక బద్రతా పించన్ పథకానికి యన్టీఆర్ భరోశా పేరు పెట్టి చరిత్రకెక్కిన విశ్వనాథ్ కరోనా మహమ్మారి నివారణకు క్షేత్రస్థాయిలో సూపర్ సానిటేషన్ పదాన్ని ఈ ప్రభుత్వంలో కోయిన్ చేసింది కూడా విశ్వనాథే. సమసమాజ స్థాపనకు ఫూలే, అంబేద్కర్ విదానాలు శరణ్యమని, నైతిక జీవనమార్గానికి గాందీవాదం ముఖ్యమని బలంగా నమ్మిన విశ్వనాథ్ తాను పనిచేసిన మండల ప్రజా పరిషత్ కార్యాలయాలలో ఫూలే , బాబాసాహెబ్, గాందీ, వివేకనంద, మదర్ థెరిసా ఇలా మహనీయుల విగ్రహాల ఏర్పాటు చేసిన ఘనత కూడా విశ్వనాథ్ కి దక్కుతుందని చెప్పచ్చు.
రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రజా క్షేత్రంలో ముందుకు నడిపించి కరడుగట్టిన ఉద్యమకారుడిగా తనకంటూ ప్రత్యేకత చాటుకున్న విశ్వనాథ్ గతమంతా ఉద్యమ చరిత్రే.. గత ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయ పనితీరు ఆదారంగా ఉద్యోగ ఉపాధ్యాయ విశ్రాంతి సమాయాన్ని 50 సంవత్సరాలకు కుదించాలని రంగం సిద్దమైయ్యింది. అత్యంత గోప్యంగా ప్రభుత్వం ముసాయిదా కూడా తయారైయ్యింది. విషయాన్ని తెలుసుకున్న విశ్వనాథ్ 5 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయుల మెడపై కత్తి వేటు పడనుందని, ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంభాలు రోడ్డున పడనున్నాయని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను జాగృతి చేయడమే కాకుండా టెలివిజన్ చానెల్స్ లో ప్రభుత్వ తీరుని తీవ్రంగా వ్యతిరేకించడం అప్పట్లో పెను సంచలనం లేపింది. నాడు విశ్వనాథ్ ఉద్యమ పటిమకు తలొగ్గిన ప్రభుత్వం ఆ ముసాయిదాను వెనుక్కం తీసుకోవడంతో రాష్ట్రంలో 5 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు విశ్వనాథ్ ఉద్యమస్పూర్తిని ప్రశంసించారు.
రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యల నివారణకు, దళిత, గిరిజన, మైనార్టీ సమస్యల పరిష్కారానికి, పేదవర్గాల పక్షాన అందిస్తున్న నిస్వార్థ సేవలను గిర్తించి పలు సంధర్భాలలో విశ్వనాథ్ ను జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వారియర్ ఆఫ్ ది పూర్, డా. బాబాసాహెబ్ అంబేద్కర్, రాష్ట్రపిత మహాత్మా జోతిరావ్ పూలే, సర్ ఆర్థర్ కాటన్ జాతీయ పురష్కారాలతో సత్కరించాయి. వివక్షతను ఎదుర్కుంటున్న వర్గాల తరుపున పోరుబాట పట్టినందుకు శ్రీసత్యసాయి సేవా పురష్కారం, ట్రూ ఇండియన్ అవార్డు కూడా విశ్వనాథ్ అందుకున్నారు. సమాజానికి, ప్రజలకు విశ్వనాథ్ అందిస్తున్న సేవలను గుర్తించి అమెరికా లోని ఆండ్రూస్ విశ్వ విద్యాలయం ప్రతినిధులు డిల్లీలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. స్వాతంత్ర సమరయోధుల కుటుంభ నేపద్యం ఉన్న విశ్వనాథ్ కు అన్ని అంశాలపై విషయ పరిజ్ఞానం ఉండడం, సమాజిక స్పృహ ఉండడం వలన సమస్యలపై స్పందించే తీరు, వాగ్దాటితో శాస్త్రీయ దృక్పథంతో తన వాదననలతో ప్రత్యర్ధులను కడా మెప్పించి గల నైజం కలిగిన విశ్వనాథ్ ఉపాధ్యాయుల సంయుక్త గళంగా శాశనమండలిలో ప్రతినిదిగా ఉంటే ఉపాధ్యాయ వర్గం ఎదుర్కుంటున్న అనేక సమస్యలు ముఖ్యంగా ఓపియస్ సాదన, పీఆర్సీ అమలు, పెండింగ్ డిఏల సాదన, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ప్రైవేట్ కాలేజి లెక్చరర్, అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల ఉద్యోగ బద్రత, పాఠశాలలు, కాలేజీలలో మౌళిక సదుపాయాల కల్పన, విశ్రాంతి ఉపాధ్యాయుల సమస్యలు, పాఠశాలలో, కాలేజీలలో రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు ఇలా న్యాయ బద్దమైన డిమాండ్ల సాధనకు మార్గం సుముఖం అవుతుంది. కమ్యూనిష్ట్ భావజాలం ఉన్న విశ్వనాథ్ తన ఉద్యమస్పూర్తితో ఉపాధ్యాయ, ఉపాధ్యాయ కుటుంభ సంక్షేమానికి ఇతోదకంగా సహాయపడగలరనె నమ్మకం ఉపాధ్యాయ వర్గాలలో, ఆన్ని ఉపాధ్యాయ సంఘాలలో ఉంది. మానవతావాదిగా పేరున్న విశ్వనాథ్ ఉభయగోదావరి జిల్లాలలో అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో ముఖ్యంగా ఉపాధ్యాయులతో ప్రత్యక్ష పరోక్ష సంభందాలున్నాయని అందరికి తెలిసిన విషయమే. అందరివాడుగా పేరున్న విశ్వనాథ్ మండలి ఎన్నికల బరిలో ఉంటే ఉభయగోదావరి జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులందరు సహకరించి అత్యంత మెజార్టీతో గెలుపించుకోవడం ఖాయమని ఉపాధ్యాయ వర్గంలో అంతర్గత చర్చ నడుస్తుంది. ఉపాధ్యాయ సంఘాలు కోరిక మేరకు విశ్వనాథ్ యం.యల్.సి ఎన్నికల బరిలో ఉండడానికి 'యస్' చెప్తే ఉపాధ్యాయ వర్గం విశ్వనాథ్ ను తమ సొంత మనిషిగా భావించి గెలుపుకు పూర్తి సహకారం అందించి తమ అభిమానాన్ని చాటనున్నాయి. అయితే ఇంకా 10 సంవత్సరాలు ప్రభుత్వ సేవా కాలం ఉన్నందున్న ఉద్యోగానికి రాజీనామా చేసి విశ్వనాథ్ ఎన్నికల బరిలో ఉంటారా లేదా అన్నది తెలియరాలేదు. విశ్వనాథ్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.