12 లోగా పోస్టల్ బ్యాలెట్ పొందాలి..


Ens Balu
4
Srikakulam
2021-02-10 21:46:11

గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఉద్యోగులు ఈ నెల 12వ తేదీ లోగా పోస్టల్ బ్యాలెట్ లను పొందాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ తెలిపారు. ఈ మేరకు బుధ వారం ఒక ప్రకటన జారీ చేస్తూ పంచాయతీ రెండవ దశ విధుల్ల ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చని చెప్పారు. విధుల్లో ఉన్న ఉద్యోగులు సంబంధిత రిటర్నింగు అధికారి లేదా మండల పరిషత్ అభివృద్ధి అధికారి నుండి పోస్టల్ బ్యాలెట్ ను తీసుకోవాలని ఆయన స్పష్టం చేసారు. నిర్ధేశిత నిబంధనల మేరకు పూర్తి చేసిన పోస్టల్ బ్యాలెట్ ను సంబంధిత మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులో రెండవ దశ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగు 13వ తేదీ మధ్యాహ్నం 4 గంటల నాటికి వేయాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించు కోవడం అత్యావశ్యమని కలెక్టర్ పేర్కొన్నారు.