స్మార్ట్ సిటీ పనులు త్వరగా పూర్తిచేయాలి..
Ens Balu
3
MVP Colony
2021-02-10 22:10:16
స్మార్ట్ సిటీ నిధులతో జరుగుచున్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జీవీఎంసీ కమిషనర్ డా. జి. సృజన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం, క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఆమె, ఎం.వి.పి.కాలనీ ఎ.ఎస్ రాజా కాలేజ్ గ్రౌండ్ లో నిర్మితమవుతున్న ఆధునిక స్పోర్ట్ ఎరీనా ఇండోర్ స్టేడియం పనులను పరిశీలించి మార్చి నెల ఆఖరికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం, వి.ఎం.ఆర్.డి.ఎ. వుడా పార్క్ ను సందర్శించి స్మార్ట్ సిటీ నిధులతో చేపడుతున్న పలు పనులను పరిశీలించారు. పార్కులో ఆకుపచ్చదనాన్ని మరింతగా పెంచాలని, లైటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసి అన్ని పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో ప్రధాన ఇంజనీర్ ఎం.వెంకటేశ్వరరావు, పర్యవేక్షక ఇంజనీరు వినయ కుమార్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, స్మార్ట్ సిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.