మార్చి 4 నుంచి ఇంజనీరింగ్ పరీక్షలు..
Ens Balu
4
Andhra University
2021-02-11 21:56:21
ఆంధ్రవిశ్వవిద్యాలయం, అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలల పరిధిలో ఇంజనీరింగ్ పరీక్షలను మార్చి 4వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.ఆదిలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. బిటెక్, బిఆర్క్, ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ మూడో సంవత్సరం ప్రధమ సెమిష్టర్ పరీక్షలు మార్చి 4 నుంచి, రెండవ సంవత్సరం ప్రధమ సెమిష్టర్ పరీక్షలు మార్చి 15 నుంచి, నాల్గవ సంవత్సరం ప్రధమ సెమిష్టర్ పరీక్షలు, బిఆర్క్ ఐదవ సంవత్సరం ప్రధమ సెమిష్టర్ పరీక్షలు మార్చి 26 నుంచి, బిఆర్క్ నాల్గవ సంవత్సరం ప్రధమ సెమిష్టర్ పరీక్షలు మార్చి 30వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఎంటెక్ మూడో సెమిష్టర్ పరీక్షలు ఏప్రియల్ 7 నుంచి ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతాయి.