సిఎస్ఓ కార్యాలయం ప్రారంభం..
Ens Balu
3
Andhra University
2021-02-11 21:58:31
ఆంధ్రవిశ్వవిద్యాలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కార్యాలయాన్ని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి గురువారం ఉదయం ప్రారంభించారు. వర్సిటీ పరిపాలనా భవనానికి ఎదురుగా ఉన్న భవనంలో సిఎస్ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ హాస్టల్స్ వద్ద పూర్తిస్థాయిలో బధ్రత చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. వర్సిటీ పరిసరాల్లో నిరంతర పర్యవేక్షణ, నిఘా పెంచాలన్నారు. పూర్తిస్తాయిలో రక్షణ చర్యలు చేపట్టాలని,దీనికి అవసరమైన సహకారాన్ని వర్సిటీ పరంగా అందిస్తామన్నారు.ఈ సందర్భంగా సిఎస్ఓ మహ్మద్ ఖాన్ను అభినందించారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, డీన్ ఆచార్య టి.షారోన్ రాజు, చీఫ్ ఇంజనీర్ ఆర్.శంకర రావు తదితరులు పాల్గొన్నారు.