ఓటు హక్కు వినియోగించుకోవాలి..
Ens Balu
4
Visakhapatnam
2021-02-11 22:45:41
గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టరు జిల్లా ఎన్నికల అధికారి వి.వినయ్ చంద్ పిలుపునిచ్చారు. గురువారం తన చాంబర్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రజలకు దగ్గరగా ఉండి సేవలందించే ప్రజా ప్రతినిధి సర్పంచ్, వార్డు మెంబర్లేనని, కాలువలు పారిశుద్ద్యం చెరువులు ఇతర అభివృద్ధి పనులకు కీలకంగా ఉండి చర్యలు చేపట్టాల్సిన నాయకులు వారేనని గమనించాలన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించు కోవాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. నర్సీపట్నం డివిజన్ లో 10 మండలాలలో 239 గ్రామపంచాయతీలు 2584 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డివిజన్ లో మొత్తం ఓటర్లు 4 లక్షల 97 వేల 782 మంది కాగా వీరిలో పురుషులు 2 లక్షల 44 వేల 228, స్త్రీలు 2 లక్షల 53 వేల536, ఇతరులు 8 మంది ఉన్నారని, అయితే ఏకగ్రీవ ఎన్నికల అనంతరం ఓటు హక్కును వినియోగించుకునే వారు 4,69,583 మంది. వీరిలో పురుషులు 2,30,252 స్త్రీలు 2,39,313 ఇతరులు 18 మంది ఉన్నారని వివరించారు. 6470 మంది పోలింగ్ అధికారులు పాల్గొంటున్నారని వీరిలో 2653 మంది ప్రిసైడింగ్ అధికారులు కాగా ఏ. పీ.ఓ., ఓ.పి.ఓ.లు 3817 అని చెప్పారు. 10 మండలాలకు సంబంధించి 44 జోన్లు, 69 రూట్లు ఏర్పాటు చేశామన్నారు.261 గ్రామ సర్పంచు లకు గాను 22 మంది ఏకగ్రీవంగా ఎన్నిక కాగా 239 గ్రామ సర్పంచు పోస్టులకు ఎన్నికలు జరుగుతున్నాయని, బరిలో 581 మంది అభ్యర్థులు ఉన్నారని వెల్లడించారు. 2584 వార్డు మెంబరు పదవులకు 400 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని మిగిలిన 2184 పదవులకు 4641 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారని తెలియజేశారు.