అక్కడ ఓటు వేయడానికి 8 కి.మీ.నడిచివచ్చారు..
Ens Balu
10
Salur
2021-02-13 19:28:58
విజయనగరం జిల్లా సాలూరు మండలం ఒడిస్సా సరిహద్దు గ్రామ పంచాయతీ సంపంగి పాడు ఎన్నికల పోలింగ్ లో పాల్గొన్న గిరిశిఖర గ్రామ ఓటర్లు. ఈ పంచాయతీ లో దిగువ రూడ, కాగరూడ, గాడివలస, కొంక మామిడి, గాలిపాడు గిరి శిఖర గ్రామాల నుంచి కొండలు, గుట్టలు, వాగులు దాటుకుంటూ కాలి నడక సుమారు 8 కిలో మీటర్ల దూరంను 2.30 గంటల పాటు ప్రయాణించి దళాయి వలసలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ బూత్ లో మధ్యాహ్నం ఒంటి గంటన్నరకి 485 ఓట్లకు గాను 61 శాతంతో 297 పోలయ్యాయి. సంపంగి పాడు గ్రామం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని గిరి శిఖర గ్రామాల నుంచి ఓటర్లు దళా అయితే ఎత్తైన కొండల పై నుంచి కాలి నడకన గిరిజన ఓటర్లు కిందికి దిగి వచ్చి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడంలో పలువురికి ఆదర్శంగా నిలిచారని చెప్పవచ్చు.