మావో ప్రభావిత ప్రాంతంలోనూ పోలీంగ్..
Ens Balu
3
Salur
2021-02-13 19:34:16
విజయనగరం జిల్లా లోని మావోయిస్టు ప్రభావిత గ్రామంగా గుర్తించిన సాలూరు మండలం కొండ శిఖర గ్రామమైన సంపంగి పాడు గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ దళాయి వలస జి.పి.ఎస్. స్కూల్ లో నిర్వచించారు. 485 ఓట్లు గల ఈ గ్రామ పంచాయతీ లో మధ్యాహ్నం 1-30 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 297 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా యంత్రాంగం చేసిన పటిష్ట మైన ఏర్పాట్లతో ఈ గ్రామంలో పోలింగ్ ప్రశాంతంగా సాఫీగా జరిగింది. కొండల పై వున్న సంపంగి పాడు, దిగువ రూఢ, కాగ రూఢ, గాడివలస, కొత్త మామిడి, గాలిపాడు తదితర గ్రామాల ప్రజలు దాదాపు 8 కిలోమీటర్ల దూరం రెండు గంటల పాటు నడిచి కొండలు దాటూకొంటూ కిందికి వచ్చి దళాయివలసలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఎన్నికల పట్ల తమకు గల నమ్మకాన్ని, ఓటుకు తాము ఎంతో విలువ ఇస్తామని తెలియజెప్పారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సగానికి పైగా జనం దైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవడం ఓటరు చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.