ఓట్లు లెక్కింపు ప్రక్రియ రికార్డు చేయండి..


Ens Balu
2
Vizianagaram
2021-02-13 19:55:05

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పంచాయ‌తీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌ను త‌ప్ప‌కుండా రికార్డు చేయించాల‌ని ఆయా మండ‌లాల ప‌రిధిలో ఉన్న ఆర్వోల‌ను క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ ఆదేశించారు. రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి వ‌చ్చిన వివిధ ఫిర్యాదుల నేప‌థ్యంలో ఎన్నిక‌ల క‌మిష‌న్ శ‌నివారం జారీ చేసిన ఉత్తర్వులను అనుస‌రించి కలెక్ట‌ర్ ఆర్వోల‌కు ఆదేశాలు జారీ చేశారు. డీపీవో సునీల్ రాజ్ కుమార్ ద్వారా అంద‌రికీ ఫోన్‌లు చేయించి త‌క్ష‌ణ‌మే అన్ని పోలింగ్ కేంద్రాల్లో కెమెరాలు, వెబ్ కాస్టింగ్‌, సీసీ కెమెరాల‌ను ఉప‌యోగించి రికార్డు చేయాల‌ని చెప్పించారు. సంబంధిత కేంద్రాల్లో కెమెరాలు అందుబాటులో లేన‌ట్ల‌యితే మొబైల్‌ల ద్వారా అయినా ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌ను రికార్డు చేయించాల‌ని ఆదేశించారు.  కౌంటింగ్ ప్ర‌క్రియను, స‌జావుగా పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించాల‌ని చెప్పారు.