అరసవెల్లి రథ సప్తమికి వి.ఐ.పి పాసులు..


Ens Balu
3
Arasavilli
2021-02-14 21:15:38

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో నిర్వహించే రథసప్తమి వేడుకలకు వి.ఐ.పి పాస్ లను జారీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఈ మేరకు ఆది వారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఈ నెల 19వ తేదీన రథసప్తమి వేడుకలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 18వ తేదీ రాత్రి 12 గంటల నుండి వేడుకలు ప్రారంభం అవుతాయని చెప్పారు. 18వ తేదీ రాత్రి 2 గంటల నుండి వి.ఐ.పి దర్శనం ప్రారంభం అవుతుందని కలెక్టర్ పేర్కొంటూ వి.ఐ.పి దర్శనానికి వచ్చే వారి వివరాలను ముందుగా రెవిన్యూ డివిజనల్ అధికారి (ఆర్.డి.ఓ)కు అందించి పాస్ లు పొందాలని విజ్ఞప్తి చేసారు. రథ సప్తమి వేడుకలలో సాధారణ భక్తులు సైతం ప్రశాంత వాతావరణంలో స్వామి వారిని దర్శించుకోవాలని అన్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. వి.ఐ.పి క్యూ లైన్ లో అనేక మంది రావడంతో నిజమైన వి.ఐ.పిలకు, డోనర్లకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ఈ నేపధ్యంలో వి.ఐ.పి పాస్ లను ప్రవేశపెట్టడం జరిగిందని స్పష్టం చేసారు. స్వామి వారి దర్శనం ఆనంద అనుభూతులు నింపాలని ఆయన అన్నారు. రథ సప్తమికి అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.