17 నుంచి 3వ విడత పంచాయతీ ఎన్నికలు ..
Ens Balu
3
Chittoor
2021-02-16 17:41:24
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొవిడ్ నియమ నిబంధనలను అనుసరిస్తూ జిల్లాలో ఈ నెల 17 న మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మదనపల్లె డివిజన్ కు చెందిన 14 మండలాల్లో 270 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడవ విడతలో 270 గ్రామ పంచాయతీలకు గాను వివిధ కారణాల రీత్యా 6 పంచాయతీలు మినహా 264 పంచాయతీలకు, 2,784 వార్డులలో 58 వార్డుల మినహా 2,726 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ విడదల చేయడం జరిగిందని తెలిపారు. అందులో 91 గ్రామ పంచాయతీలు, 1585 వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నిక అయినందున మరియు 25 వార్డు మెంబర్లకు నామినేషన్లు ధాఖలు కానందున మిగిలిన 173 సర్పంచ్ లకు మరియు 1,116 వార్డు మెంబర్లకు బుధవారo నాడు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో 2,76,207 మంది పురుషులు, 2,74,306 మంది స్త్రీలు మరియు 26 మంది ఇతరులు మొత్తం 5,50,539 మంది ఓటర్లు పాల్గొననున్నారని తెలిపారు. ఈ విడతలో 173 సర్పంచ్ స్థానాలకు గాను 1217 మంది, 1116 వార్డ్ మెంబర్ల స్థానాలకు గాను 2907 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 1483 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో 54 అత్యంత సమస్యాత్మక మరియు 59 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ పోలింగ్ కు సంబంధించి 88 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందని మరియు ఈ పోలింగ్ కేంద్రాలకు అవసరమైన స్థాయిలో పోలీసు బందోబస్త్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి 3200 పెద్దవి, 898 చిన్న బ్యాలెట్ బాక్స్ లను సంబంధిత పోలింగ్ కేంద్రాలకు తరలించామని తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు 87 మంది స్టేజ్ – 1 మరియు 308 మంది స్టేజ్ – 2 ఆర్ఓ లను, 1791 మంది పోలింగ్ అధికారులు(పి ఓ లు ), 173 మంది ఏఆర్ఓ లను, 34 మంది జోనల్ ఆఫీసర్లను, 65 మంది రూట్ ఆఫీసర్లను నియమించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల సిబ్బంది మరియు సామగ్రి తరలింపుకు అవసరమైన 174 బస్సుల ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకొంటున్నారని తెలిపారు. ఎన్నికల సామగ్రి తరలింపుకు 14 సామాగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, కొవిడ్ దృష్ట్యా ఎన్నికల సిబ్బందికి 7124 మాస్కులు, 1490 లీటర్ల హ్యాండ్ స్యానిటైజర్లు, 7124 హ్యాండ్ గ్లౌజ్ లు అందజేయడం జరిగిందన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ పేపర్లు, కవర్లు, బుక్లెట్లు, రబ్బరు స్టాంప్ లు వంటి ఇతర సామగ్రిని ఎంపిడిఓ లకు సమకూర్చడం జరిగిందన్నారు.
మూడవ విడత పోలింగ్ ఉదయం 6.30 గం.ల నుండి మ.3.30 గం.ల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఆ వెంటనే ఓట్ల లెక్కింపునకు సంబంధించి 692 మంది సూపర్ వైజర్లు, 2076 మంది కౌంటింగ్ స్టాఫ్ ను నియమించడం జరిగిందన్నారు.