సీఎం పర్యటనకు ఏర్పాట్లు పక్కాగా చేయాలి..
Ens Balu
3
Renigunta
2021-02-16 17:44:32
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 18 న తిరుపతి ప్రత్యేక పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం ఈ నెల 18 న రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు రానున్న నేపథ్యంలో అందుకు సంబందించిన ఏర్పాట్ల లో భాగంగా రేణిగుంట పాత విమానాశ్రయం లో జిల్లా కలెక్టర్, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు, తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్ గిరీషా లతో కలసి ఏ.ఎస్.ఎల్, సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత రేణిగుంట పాత విమానాశ్రయంలో ముఖ్యమంత్రి పర్యటన కు సంబందించి భద్రతా ఏర్పాట్లు ఇతర సంబందిత అంశాలపై ఇంటెలిజెన్స్ ఎస్పీ సుబ్రమణ్యస్వామి, తిరుపతి ఆర్డిఓ కనకనరసారెడ్డి, ఎయిర్పోర్టు డైరెక్టర్ సురేష్, సి.ఐ.ఎస్.ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ డి.సి.శుక్ల, ఆర్ అండ్ బీ ఇ.ఇ సుధాకర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ బాలరాజు, తహశీల్దార్ శివప్రసాద్ ఇతర సంబందిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యటన చేయు ప్రాంతాలలో ఏ.ఎస్.ఎల్ నిర్వహించారు. ఇందులో భాగంగా రేణిగుంట విమానాశ్రయం నుండి ముఖ్యమంత్రి ప్రయాణించు మార్గాన్ని మరియు చెన్నా రెడ్డి కాలనీలో రిటైర్డ్ మేజర్ జనరల్ సి.వేణుగోపాల్ నివాస గృహం ( వైట్ హౌస్) వద్ద భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. 1971 లో భారత్ - పాకిస్తాన్ కు జరిగిన యుద్ధం లో మహావీర చక్ర అవార్డు పొందిన రిటైర్డ్ మేజర్ జనరల్ సి.వేణుగోపాల్ (95 సంవత్సరాలు) పి వి ఎస్ ఎం , ఎం వి సి వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గారు రిటైర్డ్ మేజర్ జనరల్ కు సన్మాన కార్యక్రమం ఉన్నందున వారి నివాస గృహం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పోలీసు పేరేడ్ గ్రౌండ్ నందు ఈ నెల 18 న సాయంత్రం జరుగు మెగా ఈవెంట్ కార్యక్రమంలో గౌ.ముఖ్యమంత్రి పాల్గొననున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసు పేరేడ్ గ్రౌండ్ నందు ఏర్పాట్లను పరిశీలించుటలో తిరుపతి అడిషనల్ కమీషర్ హరిత, బ్రిగేడియర్ జె.ఎస్. బ్రిన్డర్, కల్నల్ లు రాహుల్ షరీన్, సుమిత్ చద్దా , గంగా సతీష్ , స్మార్ట్ సిటీ జి.ఎం చంద్ర మౌళి ఇతర అధికారులు పాల్గొన్నారు.