18 సాయంత్రం నుంచి ట్రాఫిక్ మళ్ళింపు..
Ens Balu
3
Srikakulam
2021-02-16 18:12:08
రథ సప్తమి వేడుకలు సందర్బంగా ఈ నెల 18వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ ను మళ్ళించడం జరుగుతుందని డిప్యూటి సూపరింటిండెంట్ ఆఫ్ పోలీసు ఎం.మహేంద్ర తెలిపారు. వన్ టౌన్ సర్కిల్ కార్యాలయంలో మంగళ వారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో డి.ఎస్.పి మాట్లాడుతూ 18వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి 20వ తేదీ ఉదయం 6 గంటల వరుకు ట్రాఫిక్ మళ్ళింపుపై ఆంక్షలు ఉంటాయన్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1. శ్రీకాకుళం టౌన్ నుండి గార, కళింగపట్నం వైపు వెళ్ళు ప్రయాణీకులు పి.ఎస్.ఎన్.మిల్లు జంక్షన్ నుండి 80 అడుగల రహదారి లేదా జిల్లా పరిషత్ రోడ్డు నుండి కలెక్టర్ ఆఫీస్ రోడ్, కొత్తపేట, కునుకుపేట జంక్షన్, కాజీపేట మీదుగా వాడాడ జంక్షన్ దిశగా మళ్ళించడం జరిగిందన్నారు.
2. కళింగపట్నం, గరా వైపు నుండి శ్రీకాకుళం టౌన్ వైపు వచ్చు ప్రయాణీకులు వాడాడ జంక్షన్ మీదుగా కాజీపేట, కునుకుపేట జంక్షన్, కొత్తపేట, కలెక్టర్ ఆఫీస్, 80 అడుగుల రహదారి లేదా జిల్లా పరిషత్ రోడ్ మీదుగా మళ్ళించడం జరిగిందన్నారు.
3. బందరువానిపేట, కళింగపట్నం, గార, బూరవల్లి వైపు నుండి శ్రీకాకుళం టౌన్ వచ్చే వాహనాలు సింగుపురం మీదుగా ఎన్.హెచ్ 16 మీదుగా మళ్ళించడం జరిగింది.
4. శ్రీకాకుళం టౌన్ నుండి గార, కళింగపట్నం, బందరువానిపైట వైపు వెళ్ళు వాహనాలు, శ్రీకాకుళం కాంప్లెక్సు నుండి బలగ, కొత్త రోడ్డు, ఎన్.హెచ్ 16 మీదుగా సింగుపురం దిశగా మళ్ళించడం జరిగింది.
5. శ్రీకాకుళుం టౌన్ నుండి అంపోలు, చల్లపేట జంక్షన్, శ్రీకూర్మం వైపు వెళ్ళు వాహనాలు శ్రీకాకుళం కాంప్లెక్సు నుండి బలగ, కొత్తరోడ్డు, ఎన్.హెచ్ 16 మీదుగా జైలు రోడ్డు దిశగా మళ్ళించడం జరిగింది.
6. శ్రీకూర్మం, చల్లపేట జంక్షన్, అంపోలు వైపు నుండి శ్రీకాకుళం టౌన్ వైపు వచ్చు వాహనాలు జైలు రోడ్డు, కొత్త రోడ్డు జంక్షన్, బలగ మీదుగా ఆర్.టి.సి కాంప్లెక్సు దిశగా మళ్ళించడం జరిగింది.
7. శ్రీకాకుళం వైపు నుండి అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం నిమిత్తం ఆటోలు, కార్లలో వచ్చు భక్తులు తమ వాహనాలను 80 ఫీట్ రోడ్డులో ఎడమ వైపున, ద్విచక్ర వాహనంపై వచ్చే భక్తులు 80 ఫీట్ రోడ్డులో కుడి వైపున ఏర్పాటు చేసిన స్ధలంలో పార్కింగు చేయుటకు ఏర్పాట్లు చేయడం జరిగింది.
8. కళింగపట్నం,గార వైపు నుండి వచ్చు భక్తులు తమ వాహనాలను వాడాడ జంక్షన్ దాటిన తరువాత కుడి వైపున గల పార్కింగు స్దలంలో పార్కింగు చేయాలని డి.ఎస్.పి చెప్పారు. భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకొనుటకు ప్రతి ఒక్కరూ పూర్తి సహాయ సహకారాలు అందించి విజయవంతం చేయాలని కోరారు.
అరసవల్లి ఆలయ కార్యనిర్వాహక అధికారి వి.హరి సూర్యప్రకాష్ మాట్లాడుతూ 18వ తేదీ 12 గంట్ల నుండి రథసప్తమి వేడుకలు ప్రారంభం అవుతాయన్నారు. అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పారు. 18వ తేదీ రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు స్వామి వారికి క్షీరాభిషేకం జరుగుతుందన్నారు. అనంతరం నిజ రూప దర్శనం కలుగుతుందని పేర్కొన్నారు. ఉచిత దర్శనం, వంద రూపాయల టికెట్ దర్శనం ఇంద్ర పుష్కరిణి మీదుగా క్యూలైన్ వస్తుందన్నారు. విరాళాలు ఇచ్చిన దాతలకు ప్రత్యేక క్యూ లైన్ ఉంటుందని, ఉదయం 10 గంటల వరకు విరాళ దాతలకు అవకాశం ఉంటుందని చెప్పారు. వి.వి.ఐ.పిలకు, వి.ఐ.పిలకు పాస్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. వి.ఐ.పి పాస్ లకు వేడుకల ప్రత్యేక అధికారి మరియు రెవిన్యూ డివిజనల్ అధికారికి వివరాలు సమర్పించాలని పేర్కొన్నారు.
ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో పోలీసు ఇన్ స్పెక్టర్లు సి.హెచ్.అంబేద్కర్, పి.వి.రమణ, సబ్ ఇన్ స్పెక్టర్ విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.