కోవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి..
Ens Balu
2
Kakinada
2021-02-16 22:10:16
తూర్పుగోదావరి జిల్లాలో కోవిడ్-19 టీకా పంపిణీ కార్యక్రమంపై జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, ఉన్నత వైద్యాధికారులతో కలిసి కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి.. మంగళవారం ఉదయం రంపచోడవరం నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలివిడతలో హెల్త్ కేర్ వర్కర్లు, రెండో విడతలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, మునిసిపల్, పారిశుద్ధ్య సిబ్బందికి సంబంధించి టీకాల పంపిణీపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. టీకా పూర్తిస్థాయిలో సురక్షితమైనందున లబ్ధిదారులు టీకాలు వేసుకునేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. మూడో దశ కార్యక్రమం కోసం సచివాలయాల వారీగా 50 ఏళ్లకు పైబడిన పబ్లిక్, 50 ఏళ్ల లోపు కోమార్బిడిటీస్లకు సంబంధించిన జాబితాలను వెంటనే సిద్ధం చేయాలన్నారు. మండల స్థాయిలో తుది జాబితాల రూపకల్పన కోసం ఎప్పటికప్పుడు మండల టాస్క్ఫోర్స్ సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.