టీఎస్సార్ నేత గల్లంతుపై తక్షణమే స్పందించిన మంత్రి


Ens Balu
4
siddipeta
2020-08-17 15:16:59

టీఆర్ఎస్ నేత కారుతో స‌హా వాగులో గ‌ల్లంతు అయిన ఘ‌ట‌న‌పై మంత్రి కేటిఆర్ స్ప‌దించారు. సిద్ధిపేట కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడిన మంత్రి  గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్ల‌పల్లి టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జంగపల్లి శ్రీనివాస్, నిన్న రాత్రి ముగ్గురు స్నేహితులతో కలిసి వాహనంలో వెళ్తుండ‌గా.. సిద్దిపేట జిల్లా దర్గాపల్లి వద్ద వాహనంతో స‌హా వాగులో ప‌డిపోయారు. స్థానికులు గమనించి ముగ్గురిని బయటకు తీసినప్పటికీ కారుతో పాటు శ్రీనివాస్ గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్... ఈరోజు ఉదయాన్నే సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో సిద్ధిపేట ఆర్డీవో ఘ‌ట‌నా స్థలానికి చేరుకొని గాలింపు చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.
సిఫార్సు