మూడవ దశ ఎన్నికలు ప్రశాంతం..
Ens Balu
3
Srikakulam
2021-02-17 15:50:19
శ్రీకాకుళం జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికలలో, 9 మండలాల పరిధిలో, 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో, సుమారు 2 లక్షల 90 వేల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ, ఈ రోజు 298 సర్పంచ్ స్థానాలకు గాను 248 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 588 మంది అభ్యర్థులు పోటీలో వున్నారని తెలిపారు. వార్డులకు సంబంధించి, 2648 వార్డులకు గాను 1706 వార్డుల్లో ఎన్నికలు, 3771 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు. ఉదయం 6.30 గం. ల కు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైనదని చెప్పారు. వెబ్ క్యాస్టింగ్ ద్వారా 175 పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ముందుగానే సిబ్బందిని తరలించినట్లు తెలిపారు. అక్కడ జె సి పర్యవేక్షణ చేస్తారు. భద్రతా ఏర్పాటు చేసాం, ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసామని తెలిపారు.