APEPDCL ఇన్చార్జి సీఎండీగా రాజబాపయ్య..


Ens Balu
1
Visakhapatnam
2021-02-17 21:16:30

ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఏపిఈపీడిసిఎల్ లో డైరెక్టర్ గా వున్న కె.రాజబాపయ్యను ఎఫ్ఏసిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ఇందనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ జిఓఆర్టీ నెంబరు 15ను ఈరోజు విడుదల చేశారు. ఇక్కడ సీఎండీగా ఉన్న ఎస్.నాగలక్ష్మిని మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇదేశాఖలో డైరెక్టర్ గా వున్న రాజబాపయ్యకు(ఎఫ్ఏసి) బాధ్యతలను అప్పగించింది. దీనితో ఉద్యోగులు ఆయనకు కార్యాలయంలో తమ శుభాకాంక్షలు తెలియజేశారు.