వీరుల త్యాగాలు మరువలేనివి..
Ens Balu
3
Tirupati
2021-02-18 12:08:48
తిరుపతి శ్రీ కపిలేశ్వర ప్రకృతి ఉద్యానవనం లో స్వర్ణిం విజయ్ వర్ష్ (గోల్డెన్ జుబ్లీ సెలెబ్రషన్స్ అఫ్ ఇండియన్ ఆర్మీ విక్టరీ ఓవర్ పాకిస్తాన్ ఆర్మీ ఇన్ 1971 వార్) లో భాగంగా ఆంధ్ర, తెలంగాణా సబ్ ఏరియా జి ఓసి మేజర్ జనరల్ ఆర్కే సింగ్ అధ్వర్యంలో అమర్ జవాన్స్ స్మారక స్తూపం వద్ద అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ గురువరం స్రద్ధాంజలి ఘటించారు. తొలుత ఆంధ్ర, తెలంగాణా సబ్ ఏరియా జి ఓసి మేజర్ జనరల్ కు స్వాగతం పలికారు. స్వర్ణిం విజయ్ వర్ష్ జ్యోతిని మేజర్ జనరల్ తీసుకున్నారు. అనంతరం మేజర్ జనరల్, తదితరులు అమర జవాన్స్ స్మారక స్తూపం వద్ద పూలు అర్పిత్ చేసారు. ఈ కార్యక్రమంలో బ్రిగేడియర్ జె.జె.ఎస్ బ్రిన్దర్, చిత్తూరు సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ ఏ వి రమణ మూర్తి, తిరుపతి ఎన్ సి సి గ్రూప్ కమాండర్ కల్నల్ గంగా సతీష్, తిరుపతి నగర పాలక సంస్థ అడిషనల్ కమీషనర్ హరిత, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.