ఘనంగా శ్రీశ్రీశ్రీ భావనాఋషి కళ్యాణం..
Ens Balu
5
Yanam
2021-02-18 16:24:42
యానం పద్మశాలీ సేవా సంక్షేమ సంఘం ఆద్వర్యంలో శ్రీశ్రీశ్రీ భద్రవతి సమేత భావనాఋషి వారి కళ్యాణ మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. మాఘ శుద్ద సప్తమిని అత్యంత పవిత్ర దినంగా భావించే పద్మశాలీలు భావనాఋషి స్వామి వారి కళ్యాణం జరిపించడం ఆనవాయితి. అయితే యానం పద్మశాలీ సేవా సంఘం వారు బాల కామహః, పశు కామహః, యజ్ఞోమి కామహః, శ్రీయోమి కామహః అనే ధార్మిక నినాధంతో లోక కళ్యాణార్థం గత 81 సంవత్సరాలుగా విరామం లేకుండా స్వామి వారి కళ్యాణం జరిపిస్తూ వస్తున్నారు. స్వామివారి కళ్యాణ వేడుకలను ఒగ్గు భావణాఋషి అనంతలక్ష్మి దంపతులు జరిపించగా కాకినాడ పట్టణ పద్మశాలీ సంఘం స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి తూతిక శ్రీనివాస విశ్వనాథ్, కాకినాడ పద్మశాలీ సంఘం అద్యక్షులు పొన్నగంటి సత్యనారాయణ, అయితపూడి మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు, ఆదిమూలం కృష్ణ, అయ్యంకుల సత్తిబాబు అదిక సంఖ్యలో పద్మశాలీ సంఘీయులు పాల్గొన్నారు. అనంతరం అన్నసమారాదన కార్యక్రమం జరిపి భక్తులకు స్వామివారి ప్రసాద వితరణ చేసారు.