సీఎం వైఎస్ జగన్ కు ఘనస్వాగతం


Ens Balu
4
Antervedi Pallipalem
2021-02-19 12:10:07

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నూతన రధం ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి శనివారం ఘన స్వాగతం లిభించింది. హెలీప్యాడ్ వద్ద  రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, బిసి వెల్ఫేర్ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ చింతా అనురాధ, జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, ఎమ్మెల్యేలు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. స్వామివారి రథం దుండగులు కాల్చేసిన తరువాత ప్రభుత్వం మళ్లీ అదే కొలతలతో కొత్త రథాన్ని నిర్మించింది. ఈరోజు సీఎం వైఎస్ జగన్ దానిని ప్రారంభించారు.