రాండమైజేషన్ ద్వారా కేంద్రాల కేటాయింపు..


Ens Balu
1
Vizianagaram
2021-02-19 16:29:17

విజయనగరం  డివిజన్లో ఈ నెల 21 న జరగనున్న  పంచాయతి ఎన్నికల పోలింగ్ సిబ్బందికి 3వ రాండమైజేషణ్ ద్వారా శుక్రవారం పోలింగ్ కేంద్రాలను కేటాయించారు.  ఎన్.ఐ.సి లో వ్యయ పరిశీలకులు సందీప్ కృపాకర్, జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ ఈ రాండమైజేషణ్ ద్వారా పోలింగ్ అధికారులను , అదర్ పోలింగ్ అధికారులను  , రిజర్వు  సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు కేటాయించారు. 4వ దశ లో దత్తిరాజేరు, మెంటాడ, గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, ఎస్.కోట, వేపాడ, ఎల్.కోట, జామి, కొత్తవలస 10 మండలాల్లో జరగ నున్న  2793 పోలింగ్ కేంద్రాలకు గాను 6222 మందిని  నియమించారు . 342 మందిని రిజర్వ్ లో ఉంచారు.   మరో 309 మందిని  రిజర్వు లో నియమించారు. వీరందరికీ వెంటనే  ఉత్తర్వులను అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమం లో సంయుక్త కలెక్టర్ డా. మహేష్ కుమార్,  జిల్లా రెవిన్యూ అధికారి గణపతి  రావు, డి.పి ఓ సునీల్ రాజ్ కుమార్,  ఎన్.ఐ.సి డి.ఐ.ఓ  నరేంద్ర , సహాయ అధికారి బాలసుభ్రమణ్యం, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ రామకృష్ణ  తదితరులు పాల్గొన్నారు.