మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి..
Ens Balu
2
Vizianagaram
2021-02-19 17:21:23
విజయనగరం జిల్లాలో మార్చ్ నెల 10న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు. శుక్రవారం అయన ఛాంబర్ లో మున్సిపల్ కమీషనర్ల తో ఎన్నికల ఏర్పాట్ల పై సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పట్నుంచే చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది ఎంత మంది అవసరం అవుతారో అంచనా వేసి ఎన్.ఐ.సి కి లేఖ పంపలన్నారు. ఎన్నికల పరిశీలకుల కోసం వాహనాలను, లైజెన్ అధికారులను, భోజన, వసతి ని చూసేందుకు సమర్ధులైన వారిని నియమించాలని అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను నియమించుకోవాలని, వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేయాలనీ సూచించారు. కౌంటింగ్ కోసం సి.సి కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. షెడ్యూల్ ప్రకారంగా ప్రతి అంశాన్ని క్సున్నంగా పరిశీలించి ముందస్తు ప్రణాళికలను వేసుకోవలన్నారు. ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్ డా. మహేష్ కుమార్, సహాయ కలెక్టర్ సింహాచలం, విజయనగరం కార్పొరేషన్ కమీషనర్ వర్మ, బొబ్బిలి, పార్వతీపురం, నెల్లిమర్ల, సాలూరు మున్సిపల్ కమీషనర్లు ఎం.మల్లయ్య నాయుడు, కనక మహలక్ష్మి, పి. అప్పల నాయుడు, పి.వ.రమణ మూర్తి తదితరులు హాజరయ్యారు.