నిర్ధేశిత సమయంలోపు హాజరు వేయాలి..
Ens Balu
1
Kurnool
2021-02-19 18:00:07
కర్నూలు నగరంలోని అన్ని శానిటరీ డివిజన్లల్లో ప్రతి రోజు తెల్లవారుజామునే నిర్ధేశించిన సమయంలోపే విధులకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు హాజరుపట్టికను వేయాలని నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ వార్డు శానిటరీ కార్యదర్శులు, శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఉదయం మూడవ శానిటరీ డివిజన్ పరిధిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి రోజు పాతబస్తీ జిమ్మిచెట్టు వద్ద మష్టర్ ప్రక్రియ(మష్టర్ అనగా కార్మికులకు హాజరు వేయడం, వారికి రోజూ వారి పారిశుద్ధ్య పనుల అప్పగింత) జరుగుతుంది. ఇందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు కర్నూలు నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ పాతబస్తీ జమ్మిచెట్టు వద్ద వార్డు శానిటరీ కార్యదర్శులు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఈ ప్రక్రియ ఎలా నిర్వహిస్తున్నారు? పారిశుద్ధ్య కార్మికులకు సమయానికి హాజరు వేస్తున్నారా లేదా అని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డివిజన్లల్లో జరిగే డ్రైనేజీ పూడికతీత పనులను ఎప్పటికపుడు రికార్డుల్లో నమోదు చేయాలని, అలాగే సంబంధిత శానిటరీ సిబ్బంది వాటిపై డిసిల్ట్ చేసినట్లు స్థానికల నుంచి సంతకాలను పెట్టించుకోవాలని సూచించారు.