విశాఖలో SCRWA కార్యాలయం ప్రారంభం..
Ens Balu
2
Visakhapatnam
2021-02-19 18:07:23
స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ నేతృత్వంలో యూనియన్ గౌరవ సలహాదారులు నాగనబోయిన నాగేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం భగవంతుని సన్నిధానములో జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసోసియేషన్ కు కార్యాలయం ఏర్పాటు చేయడం శుభపరిణామం అన్నారు. వర్కింగ్ జర్నలిస్టులకు మరింత సంక్షేమం అందించే విధంగా భవిష్యత్తులో అసోసియేషన్ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ, వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే ద్యేయంగా ఎస్.సి.ఆర్.డబ్ల్యూ. ఏ పనిచేస్తుందని అన్నారు. నూతనంగా ప్రారంభించిన కార్యాలయంలో జర్నలిస్టులకు ఉపయోగపడే విధంగా ఇంటర్నెట్, కంప్యూటర్ల సౌకర్యంను ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా జర్నలిస్టుల వృత్తిలో నైపుణ్యతను పెంపొందించేందుకు శిక్షణ తరగతులను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. గ్రేటర్ విశాఖ పరిధిలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరికి సంక్షేమం అందేంచే విధంగా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో
అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కర్రి సత్యనారాయణ(సత్య),కార్యదర్శి నక్కాన అజయ్ కుమార్ యాదవ్,ఉపాధ్యక్షులు కాళ్ల సూర్య ప్రకాష్(కిరణ్),రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు జి.వి.సాగర్, నవగాని శరత్, వల్లీ,చందు తదితరులు పాల్గొన్నారు.