ఆ తర్వాత మాస్కు అవసరంలేదు..


Ens Balu
3
Vizianagaram
2021-02-19 18:15:23

 కోవిడ్ వ్యాక్సిన్ రెండవ డోసు తీసుకున్న ప‌దిహేను రోజుల త‌ర్వాత నుంచి మాస్కు వాడాల్సిన అవ‌స‌రం వుండ‌ద‌ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్‌.వి.ర‌మ‌ణ కుమారి వెల్లడించారు. జిల్లాలో మొద‌టి డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారంతా 28 రోజుల త‌ర్వాత త‌ప్పనిస‌రిగా రెండో డోసు తీసుకోవాల‌న్నారు. రెండో డోసు త‌ర్వాత ఎవ్వరికీ మాస్కు వాడాల్సిన అవ‌స‌ర‌మే వుండ‌ద‌న్నారు. కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి ఎలాంటి అపోహ‌లు అవ‌స‌రం లేద‌న్నారు. ఇది పూర్తి సుర‌క్షిత‌మైన టీకా అన్నారు. వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఆన్ లైన్ ధృవ‌ప‌త్రం కూడా జారీచేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రధాన‌మంత్రి ఫోటోతో వున్న ధృవ‌ప‌త్రాన్నిఆమె ప్రద‌ర్శించారు.