గాంధీజీ సాక్షిగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కదం తొక్కారు..
Ens Balu
2
Visakhapatnam
2021-02-20 12:24:02
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో గాంధీజి సాక్షిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోవడానికి వేలది ప్రజానికంతో కదం తొక్కింది. శనివారం విశాఖలోని జీవిఎంసీ ఎదురుగా ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ యాత్రను ప్రారంభించారు రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా ఒకే నినాదంగా కేంద్రానికి వినిపించేలా ఈ యాత్ర కొనసాగాలంటూ ఆ మహాత్ముడుకి నివాళులు అర్పించి ఒకదండుగా కదలి ముందుకి సాగారు. ఈ మహత్తర కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన క్రిష్ణదాసు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణశ్రీనివాస్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, గాజువాక ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి, ఉత్తర నియోజకవర్గ నాయకులు కెకెరాజు, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.