విశాఖ స్టీల్ కోసం కలం కార్మికులు ఏకమయ్యారు..


Ens Balu
4
Visakhapatnam
2021-02-20 13:58:10

విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకోవడం కోసం కలం కార్మికులంతా ఏకమయ్యారని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. శనివారం విశాఖలోని గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీ నాయకులు, మంత్రులతో కలిసి నివాళులు అర్పించిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకోవడం చేస్తున్న ఉద్యమానికి జర్నలిస్టులు కూడా సంఘీభావం వారి వార్తలు, ప్రత్యక్ష ప్రసారాలు, కథనాల  ద్వారా తెలియజేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నప్పటి నుంచి ముందు తమ గళం విప్పింది జర్నలిస్టులేనని, నాటి నుంచి నేటి వరకూ స్టీల్ ప్లాంట్ కోసం జరుగుతున్న పోరాటం మొత్తాన్ని జర్నలిస్టులు ప్రత్యేక కవరేజీ చేస్తూ అన్నివర్గాల ప్రజలను చైతన్యం చేస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని కూడా తమ సీనియర్ జర్నలిస్టులే అప్పటి పరిమిత మీడియా ద్వారా ప్రజల్లోకి తమ ప్రత్యేక కథనాల ద్వారా తీసుకెళ్లారని కొనియాడారు. సమాజంలో జర్నలిస్టు అనే వ్యక్తి లేకపోతే ప్రజా ఉద్యమాలు ప్రభుత్వం ద్రుష్టికి వెళ్లే పరిస్థితి లేదన్నారు. నవరత్న హోదా కలిగిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవడానికి జర్నలిస్టులు తమ కలంతో రాస్తున్న కధనాలు యావత్ భారతదేశ ప్రజలను, ప్రభుత్వాలను, రాజకీయ పార్టీలను కదిలిస్తున్నాయని అన్నారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి అన్ని వర్గాల కార్మిక సంఘాలు, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తమ పూర్తిస్థాయి మద్దతును జర్నలిస్టులు ప్రకటించారని గంట్ల శ్రీనుబాబు చెప్పారు.