ఎన్నికలు సజావుగా జరిపించండి..


Ens Balu
1
Vizianagaram
2021-02-20 17:10:19

విజయనగరం జిల్లాలో 10 మండలాల్లో జరుగుతున్న నాల్గవ విడత పంచాయతి ఎన్నికలు సజావుగా జరిగేలా  చూడాలని  జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ ఆదేశించారు. 3వ విడతలో సక్రమంగా జరిగాయని, ఓటింగ్ శాతం కూడా రాష్ట్రం లోనే అధికంగా జరిగిందని, అదే విధంగా 4వ విడత లో కూడా జరగాలని అన్నారు.  శనివారం  కలెక్టర్ గంట్యాడ, ఎస్.కోట, వేపాడ, ఎల్.కోట, కొత్తవలస  మండలాల్లో సుడిగాలి పర్యటన జరిపి ఎన్నికల ఏర్పాట్లను తనిఖీ చేసారు.  ఎన్నికల మెటీరియల్ సరఫరా,  పోలింగ్ ఏర్పాట్లు,  ఎన్నికల సిబ్బందికి భోజన సదుపాయాలు తదితర అంశాల పై రిటర్నింగ్ అధికారులను ఆరా తీసారు. మండల ప్రత్యెక అధికారులను, రిటర్నింగ్ అధికారులను కలసి  సిబ్బంది, మెటీరియల్ తదితర అంశాలలో సమస్య లేమైనా  ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.  సమస్యాత్మక గ్రామాల్లో వెబ్ కాస్టింగ్ , వీడియో, మైక్రో అబ్సర్వర్ లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.  అదే విధంగా టాస్క్ ఫోర్సు బృందాలు కూడా తనిఖీ లు చేస్తాయని అన్నారు.  కౌంటింగ్ కు  సి సి కెమెరా లను ఏర్పాటు చెయ్యాలన్నారు. పోలింగ్,  కౌంటింగ్ సమయాలలో ఎలాంటి మార్పు లేకుండా ఖచ్చితంగా జరపాలన్నారు.   నాలుగు మండలాల్లో ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేసారు. కొత్తవలస  మండలం ఎన్నికల సిబ్బంది కొంత మంది 2.30గంటలు  అవుతున్న భోజనం ఇంకా పెట్టలేదని కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా, భోజన ఏర్పాట్ల వద్దకు వెళ్లి కలెక్టర్ తనిఖీ చేసారు. అక్కడ సరిపడా భోజనం లేకపోయేసరికి భోజనాలకు ఇబ్బంది లేకుండా  చూడాలని పదే పదే ఆదేసించినా భోజనాలు ఏర్పటు చేయకపోవడం పై తహసిల్దార్, ఎం.పి.డి.ఓ ల పై ఆగ్రహం వ్యక్తం చేసారు.  భోజనాలు, తాగు నీరు వెంటనే ఏర్పాటు చేయాలనీ ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను నియమించుకోవాలని, వెబ్ కాస్టింగ్  కు ఏర్పాట్లు చేయాలనీ సూచించారు.  కౌంటింగ్ కోసం  సి.సి కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం ప్రకిర్య సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అధికారులు చుదలనిసుచించారు.