రామతీర్థం నిర్మాణానికి అనుమతులు..


Ens Balu
3
Vizianagaram
2021-02-20 20:07:05

విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండపై శ్రీ కోదండ రామాలయం పునర్నిర్మాణం నిమిత్తం దేవాదాయ శాఖ కమిషనర్ పరిపాలన, సాంకేతిక పరమైన అనుమతులు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా ఎం. హరిజవహర్ లాల్ తెలిపారు. ఈ ఆలయ పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.3 కోట్లు మంజూరు చేసిందని, ఈ నిధులతో దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్మాణం చేపడతారని పేర్కొన్నారు. ఈ - ప్రోకూర్ మెంట్ నిబంధనల మేరకు టెండర్ లు పిలవాలని ఆలయ ఇ.ఓ.కు ఆదేశించినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా ఆలయ పునర్నిర్మాణం పనులు సక్రమంగా జరిగేలా తగిన పర్యవేక్షణ చేయాలని ఆదేశించడం జరిగిందతెలిపారు.