శ్రీకాకుళం జిల్లాలో 83.81% పోలింగ్..
Ens Balu
3
Srikakulam
2021-02-21 18:46:43
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన చివరి విడత పంచాయతీ ఎన్నికలలో 83.81 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలోని ఎచ్చెర్ల, జి.సిగడాం, రణస్థలం, గార, శ్రీకాకుళం, నరసన్నపేట, జలుమూరు, పోలాకి మరియు సారవకోట మండలాల్లో పోలింగ్ ఆదివారం ఉదయం 06.30గం.ల నుండి మధ్యాహ్నం 03.30గం.ల వరకు జరిగింది.ఈ ఎన్నికల్లో 9 మండలాల నుండి 83.81 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎచ్చెర్ల మండలంలో 85.08 శాతం, జి.సిగడాం మండలంలో 86.89, రణస్థలం మండలంలో 88.86, గార మండలంలో 80.43 శాతం, శ్రీకాకుళం మండలంలో 84.04 శాతం, నరసన్నపేట మండలంలో 80.70 శాతం, జలుమూరు మండలంలో 84.75, పోలాకి మండలంలో 81.60, సారవకోట మండలంలో 81.56 శాతం వెరశి 83.81 శాతం పోలింగ్ నమోదు అయింది. మొదటి విడత ఎన్నికల్లో 75.77 శాతం ఓటర్లు తమ ఓటును వినియోగించుకోగా, రెండవ విడతలో 72.87 శాతం, మూడవ విడతలో 80.13 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా గ్రామాల్లో ఓటు హక్కుపై అవగాహన పెరగడంతో తుది విడతలో 83.81 శాతానికి ఓట్లు పెరగడం విశేషం.