స్పందన దరఖాస్తులకు తక్షణ పరిష్కారం..
Ens Balu
3
Srikakulam
2021-02-22 14:22:41
శ్రీకాకుళం లో సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా ఫిర్యాదుల విభాగంలో డయల్ యువర్ ఫోన్ ద్వారా స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి పలువురు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేసారు. కవిటి మండలం బి.గొనగపుట్టుగ నుండి యల్.వెంకటరమణమూర్తి ఫోన్ చేసి మాట్లాడుతూ తన తండ్రి పేరున గల ఎ2.07 సెంట్ల భూమిని తన పేరునకు మార్పుచేయాలని కోరారు. టెక్కలి పాత బస్టాండ్ నుండి పి.చిట్టెమ్మ మాట్లాడుతూ గ్రామకంఠం నిషేదిత జాబితా నుండి పేరు తొలగించాలని కోరారు. మందస మండలం సొండిపూడి నుండి పి.ప్రశాంత్ మాట్లాడుతూ తన రేషన్ కార్డుపై రేషన్ వేరేవ్యక్తికి ఇస్తున్నారని, దానిపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. సంతకవిటి మండలం మందరాడ నుండి టి.సురేష్ కుమార్ మాట్లాడుతూ తమ గ్రామానికి రేషన్ వాహనం ఏర్పాటుచేయాలని కోరారు. నందిగాం మండలం కణితివూరు నుండి కె.నరేష్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో టెక్కలిలో డిజిటల్ అసిస్టెంటుగా పనిచేసిన కాలానికి జీతభత్యాలు మంజూరుచేయలేదని ఫిర్యాదు చేసారు. కొత్తూరు మండలం పొన్నువూరు నండి వై.సంతోష్ కుమార్ ఫోన్ చేస్తూ తమ గ్రామంలోని 20 మంది రైతులకు మోటార్లు ఉన్నాయని, కాని మీటర్ కనెక్షన్లు లేవని వాటిని మంజూరుచేయాలని కోరారు. బూర్జ మండలం జంగాలపేట నుండి కె.సత్యం మాట్లాడుతూ ఫిబ్రవరి 2020 నుండి తనకు వృద్ధ్యాప్య పింఛను మంజూరుకావడంలేదని ఫిర్యాదు చేసారు.పొందూరు నుండి యం.పార్వతి మాట్లాడుతూ చేనేత కార్మికుల ఇళ్లకు రుణాలను మంజూరుచేయాలని కోరారు. శ్రీకాకుళం నగరంలోని దండి వీధి నుండి కె.సుదర్శనరావు మాట్లాడుతూ వృద్దాప్య పింఛను గత ఏడాది జూన్ మాసం నుండి మంజూరుచేసినప్పటికీ ఇంతవరకు పింఛను విడుదల కావడంలేదని ఫిర్యాదు చేసారు. ఆమదాలవలస మండలం లక్ష్ముడుపేట నుండి వై.రాజేష్ ఏ.పి.జి.వి.బి బ్యాంకు ద్వారా డ్వాక్రా రుణం మంజూరుచేయడం లేదని ఫిర్యాదు చేసారు.