అనంతలో 44 పంచాయతీలు ఏకగ్రీవం..
Ens Balu
3
Anantapur
2021-02-22 20:47:35
అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు నాలుగు విడతలుగా నిర్వహించిన గ్రామ పంచాయితీ ఎన్నికల నామినేషన్ వివరాలను విడుదల చేశారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో వాటిని వెల్లడించారు. జిల్లాలో మొత్తం 63 మండలాల్లోని 1040 గ్రామ పంచాయితీలకు గాను 44 మంది సర్పంచులు, 10,692 వార్డులకు గాను 2860 మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. మిగిలిన 995 సర్పంచు పదవులకు, 7765 వార్డులకు పోలింగ్ నిర్వహించామన్నారు. సర్పంచు పదవికి 6922 నామినేషన్లు, వార్డులకు 22,656 నామినేషన్లు అందాయన్నారు. అసలు ఒక్క నామినేషన్ కూడా అందని వార్డులు 76 ఉన్నాయన్నారు. సర్పంచు నామినేషన్లు వేసిన వారిలో 4,106 మంది, వార్డులకు నామినేషన్ వేసిన వారిలో 5140 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారన్నారు. అంటే 59.31 శాతం సర్పంచు నామినేషన్లు, 22.68 శాతం వార్డు మెంబరు నామినేషన్లు ఉపసంహరించుకోవడం జరిగిందన్నారు. 45 సర్పంచు నామినేషన్లు, 245 వార్డు మెంబర్ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయన్నారు. అంతిమంగా సర్పంచు పదవికి 2764 మంది, వార్డులకు 16,556 మంది పోటీ పడ్డారన్నారు.