4న భారత ఉప రాష్ట్రపతి తిరుమల పర్యటన..
Ens Balu
2
Chittoor
2021-02-23 14:15:08
భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తిరుపతి, తిరుమల పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లా కు రానున్నారని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఉప రాష్ట్రపతి మార్చి 4 న చెన్నై నుంచి వాయుసేన ప్రత్యేక విమానం ద్వారా బయల్దేరి ఉ. 9.50 గం.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారన్నారు. అనంతరం ఉ. 10.15 గం. లకు తిరుపతి లోని ఐఐటి కళాశాల చేరుకుని అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని, తర్వాత ఉ. 11.20 గం. లకు తిరుపతి లోని అమర ఆసుపత్రి ప్రారంభోత్సవం చేస్తారని వివరించారు. ఆ తరువాత మ. 12.15గం. లకు తిరుమల బయల్దేరి మ.1.15 గం. లకు తిరుమల పద్మావతి అతిథి గృహం చేరుకుని, రాత్రి బస చేస్తారని తెలిపారు. 5 వ తేదీ ఉదయం 5.30గం. లకు శ్రీ వారిని దర్శించుకుని ఉ.8.30 గం.లకు తిరుమల నుండి బయల్దేరి ఉ. 9.20గం. లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ఉ. 9.25 గం. లకు వాయుసేన ప్రత్యేక విమానంలో సూరత్ బయల్దేరి వెళతారని కలెక్టర్ తెలియజేశారు.