28లోగా ఖర్చుల వివరాలు సమర్పించాలి..
Ens Balu
2
Srikakulam
2021-02-24 22:07:09
శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చుల వివరాలను ఈ నెల 28వ తేదీ నాటికి సమర్పించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు సచిన్ గుప్తా ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల వ్యయాలపై ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎం.పి.డి.ఓ లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధుల ఖర్చుల వివరాలను తక్షణం సమర్పించాలని ఆదేశించారు. అభ్యర్ధుల ఖర్చుల వివరాలు సేకరించాల్సిన బాధ్యత సంబంధిత ఎం.పి.డి.ఓలదేనని తేల్చిచెప్పారు. పోటీ చేసిన అభ్యర్ధుల ఖర్చులు ఖచ్చితంగా ఉండాలని, ఎట్టి పరిస్థితిల్లోనూ ఈ నెల 28లోగా సమర్పించేలా చర్యలు తీసుకోవాలని ఎం.పి.డి.ఓలకు స్పష్టం చేసారు. ఈ సమావేశంలో జిల్లా ఆడిట్ అధికారి కె.రాజు తదితరులు పాల్గొన్నారు.