అనంత కలెక్టర్ కు సీఎం వైఎస్ జగన్ కితాబు..
Ens Balu
1
Anantapur
2021-02-25 21:54:09
అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రడుని రాష్ట్రముఖ్యమంత్రి అభినందించారు. పీఎం కిసాన్ జాతీయ అవార్డు అందుకున్న నేపథ్యంలో గురువారం వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు రామకృష్ణ తో సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. అనంతరం అవార్డు రావడానికి గల కారణాలను సీఎంకి వివరించారు. దీనితో స్పందించిన సీఎం వెరీగడ్ కలెక్టర్ గారు..మంచి అవార్డు రాష్ట్రానికి తేవడంతో విశేషంగా క్రుషిచేశారు అంటూ కితాబిచ్చారు. ఇదే ఉత్సాహంతో ప్రభుత్వ పధకాల అమలుతోపాటు ప్రతీ నిరుపేదకు పథకాలు పూర్తిస్థాయిలో అందేలా చూడాలని సీఎం కలెక్టర్ కు సూచించారు. ఇలాంటి అవార్డులు మరిన్ని మీరు అందుకోవాలని రాష్ట్రాన్ని అన్ని పథకాల విషయంలో ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ గంధం చంద్రుడుని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రానికి పీఎం కిసాన్ జాతీయ స్థాయి అవార్డు రావడంతోపాటు, దానిపై ముఖ్యమంత్రి ప్రశంస నాలో మరింత ఉత్తేజాన్ని బాధ్యతను పెంచాయని అన్నారు. సీఎం సూచనలు తప్పక పాటిస్తూ, అన్ని రంగాల్లో అనంతపురం జాల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలబెట్టడానికి శక్తివంచన లేకుండా క్రుషిచేస్తానని వివరించారు.