చెరువులను పరిరక్షించుకోవాలి..
Ens Balu
4
Vizianagaram
2021-02-27 16:19:56
చెరువులను కాపాడుకోవటం ద్వారా భూ గర్భ జలాలను పెంపొందించవచ్చని కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ పేర్కొన్నారు. కావున భూ గర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. భోగాపురం మండల పరిధిలోని రాజపులోవ కూడలి వద్ద శనివారం చేపట్టిన ఒలవరాజు చెరువు శుద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దీనిలో భాగంగా చెరువు గట్టుపై ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ఇబ్బందికరంగా ఉన్న దుక్కలను, చెత్తను, ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించారు. అంతరం వివిధ రకాల మొక్కలు నాటారు. వాటి చుట్టూ రక్షణ కవచాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో నిర్వహిస్తున్న ఈ మహాత్తర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం అవ్వాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. చెరువులను కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సునీల్ రాజ్ కుమార్, డి.ఎఫ్. వో. జానకి రావు, జిల్లా అగ్నిమాపక అధికారి మోహనరావు, ఎ.డి.ఎఫ్.వో సోమేశ్వర్రావు, ఎంపిడిఓ బంగారయ్య, డా. వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ కె.వి. రమణ, వై. కృష్ణ, రామ్మోహన్, ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. ఎపివో ఆదిబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.