ఏపిజిఇఏ కార్యవర్గం ఎన్నిక..
Ens Balu
2
Srikakulam
2021-02-27 20:06:14
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపిజిఇఏ) జిల్లా శాఖ కార్యవర్గం శనివారం ఎన్నికైంది. సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏపిజిఇఏలో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ సందర్భంగా భర్తీ చేసారు. ఇందులో రిమ్స్ స్టాఫ్ నర్స్ టి.పద్మజను స్టేట్ ఆఫీస్ బేరర్ గా ఎన్నుకోగా, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు వి.పద్మను జిల్లా శాఖ మహిళా కన్వీనర్ గాను, ఎస్.టి.ఓ సి.హెచ్.సమతా రాణాను ఆర్గనైజింగ్ సెక్రటరీగాను, అంబేద్కర్ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.పి.సుజాతను వైస్ ప్రెసిడెంట్ గాను, న్యాయవాది టి.సుధారాణిని న్యాయ సలహాదారుగాను, రిమ్స్ స్టాఫ్ నర్స్ వి.చిలకమ్మను మహిళా విభాగం జాయింట్ సెక్రటరీగాను ఎన్నుకున్నారు. ఈ ఎంపిక ఏపిజిఇఏ జిల్లా కార్యదర్శి అలికాన రాజేశ్వరి ఆధ్వర్యంలో భర్తీ చేసారు. కార్యక్రమంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ వి.రఘుబాబు, సహ ప్రెసిడెంట్ ఐ.నారాయణ రావు, గ్రామ సచివాలయాల విభాగం జిల్లా ప్రెసిడెంట్ కె.వెంకట సత్యనారాయణ, విశాఖపట్నం వి.ఎం.ఆర్.డి.ఏ సి.ఏఓ జి.నిర్మలమ్మ, జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్ర కళ, ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరక్టర్ జి.జయదేవి, సాంఘిక సంక్షేమ గురుకులం సమన్వయ అధికారి వై.యశోద లక్ష్మి, ఏటిఓలు తవిటయ్య, సావిత్రి, డివిజనల్ పి.ఆర్.ఓ పి.లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు.