విశాఖ డిపీఓ క్రిష్ణకుమారికి స్థాన చలనం..


Ens Balu
4
Visakhapatnam
2021-03-01 15:07:20

విశాఖజిల్లా పంచాయతీ అధికారిణి క్రిష్ణకుమారిని ప్రభుత్వం బదిలీచేసింది. ఆమెను జిఏడికి రోపోర్టు చేయాల్సిందిగా మెయిల్ ద్వారా ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయనేది ఆ మెయిల్ యొక్క సారాంశం. అయితే ఏ జిల్లాకి బదిలీ చేశారో అందులో పేర్కొనకుండి జిఏడికి రాపోర్టు చేయాల్సిందిగా ఆ ఉత్తర్వులు ఉన్నాయని డిపిఓ క్రిష్ణకుమారి ఈఎన్ఎస్ లైవ్ కు ప్రత్యేకంగా తెలియజేశారు. ఈ ఎన్నికల సమయంలో జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజనను బదిలీ చేసిన ప్రభుత్వం, తాజాగా గ్రూప్1 అధికారి డిపిఓ క్రిష్ణకుమారికూడా బదిలీచేసింది. ఈ ఇద్దరు అధికారులను జిఏడికే రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే ఈ అధికారులను బదిలీ చేశారని సమాచారం అందుతుంది. అయితే ఎన్నికల తరువాత మళ్లీ వీరిని ఇదే స్థానానికి తిరిగి పంపిస్తారని ప్రచారం జరుగుతున్నా.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచిచూడాలి.