సాలురులో జోనల్ అధికారుల మార్పు..
Ens Balu
1
Vizianagaram
2021-03-03 18:01:22
విజయనగరం జిల్లా సాలూరు మునిసిపాలిటీకి జరుగుతున్న ఎన్నికలను ద్రుష్టిలో ఉంచుకొని జోనల్ అధికారులను మార్పు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ ఉత్తర్వులు జారీ చేసారు. సాలూరు మునిసిపాలిటీ ఎన్నికల్లో జోన్-3కి జోనల్ అధికారిగా వ్యవహరిస్తున్న పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ విభాగం (పిఐయు) కార్యనిర్వహక ఇంజనీరు ఎం.వి.ఎన్. వెంకటరావు స్థానంలో మండల ఇంజనీరింగ్ అధికారి డి.లోకనాధంను నియమిస్తు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసారు. పంచాయితీరాజ్ విభాగంలో పనులు చేపడుతున్న దృష్ట్య ఆ శాఖ పర్యవేక్షక ఇంజనీరు విజ్ఞప్తి మేరకు ఉత్తర్వులు చేయడం జరిగిందని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కోన్న కలెక్టర్ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయన్నారు.