విశాఖ స్టీల్ కోసం రాష్ట్ర బంద్ సక్సెస్..
Ens Balu
4
Visakhapatnam
2021-03-05 17:58:32
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తలపెట్టిన రాష్ట్ బంద్ విశాఖలో పూర్తిగా విజయవంతం అయ్యింది. విశాఖ నగరంతోపాటు జిల్లాలోనూ అన్ని వర్గాలు స్వచ్ఛందంగా ఈ బంద్ లో పాల్గొన్నారు. దీనితో ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ ఇలా అన్ని నిర్మానుష్యంగా మారాయి. ఆందోళన కారులంతా అధికార పార్టీ నిర్వహించిన బంద్ లో పాల్గొన్నారు. జాతీసంపదను విచ్చిన్నం చేస్తా మంటే విశాఖ ప్రజలు ఊరుకోరనే విషయం కేంద్రానికి తెలియజెప్పడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు తెలియజేయడంలో సఫలీక్రుతలయ్యారు. రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి కన్నబాబు, జిల్లా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్, నగర అధ్యక్షులు వంశీక్రిష్ణశ్రీనివాస్, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబులు ఈ ఉద్యమంలో ఆందోళనాకారులతో కలిసి తమ మద్దతులను, స్టీలుప్లాంట్ ను కాపాడుకోవడానికి కదం తొక్కారు. గ్రామీణ ప్రాంతంలో రోజంతా బంద్ పాటించారు. నగరంలో మాత్రం మధ్యహ్నాం మూడు గంటలు దాటిన తరువాత జన సంచారం మొదలైంది..