ఆర్జీదారులు సంతృప్తితో వెళ్లాలి..
Ens Balu
7
Srikakulam
2021-03-05 19:52:20
వార్డు,గ్రామ సచివాలయాలకు వచ్చే ఆర్జీదారులు సంతృప్తితో ఇంటికి తిరిగివెళ్లాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ వార్డు సచివాలయ సిబ్బందికి సూచించారు. ఎన్నో ఆశలతో ఆర్జీదారులు సచివాలయాలకు వచ్చి దరఖాస్తులను సమర్పిస్తారని, వాటిన్నింటిని పరిశీలించి వీలైనంత త్వరగా అర్హత మేరకు మంజూరుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం పలాస పరిధిలో గల పలు వార్డు సచివాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసారు. వార్డు సచివాలయాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్న ఆయన సచివాలయంలో నిర్వహిస్తున్న రిజిష్టర్లను పరిశీలించారు. వార్డు సచివాలయాలకు వచ్చే ఆర్జీదారులు సమర్పించే దరఖాస్తుల వివరాలను సంబంధిత రిజిష్టర్లలో ఎప్పటికపుడు నమోదు చేయాలని ఆదేశించారు. ఆర్జీదారుల సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరిస్తూ ప్రజల మన్ననలను పొందాలని, అధికారులు తనిఖీలకు వచ్చినపుడు సచివాలయంలో నిర్వహిస్తున్న రిజిష్టర్లను అందజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడా, ఎం.డి.ఓ రమేష్ నాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు.